ఏపీలో అరాచక పాలన

ABN , First Publish Date - 2021-11-26T06:07:47+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు అమాయకులు బలవుతున్నారని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు.

ఏపీలో అరాచక పాలన
జీవీ ఆంజనేయులు

సైదాపై వైసీపీ వర్గీయుల దాడి అమానుషం

నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు జీవీ 

వినుకొండ, నవంబరు 25: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు అమాయకులు బలవుతున్నారని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. వినుకొండలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైదాపై వైసీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేసి పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడటం దుర్మార్గమన్నారు. రాజకీయ కక్షలతో వైసీపీ వర్గీయులు వీధిరౌడీల్లా జాతీయ రహదారిపై ఈడ్చుకెళ్లి రాళ్లతో పొడుస్తుంటే తట్టుకోలేని సైదా, ఆర్తనాదాలు ప్రతిఒక్కరిని కలిచివేశాయన్నారు. ఈ కిరాతక దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. పాదయాత్రలో జగన్‌రెడ్డి ముస్లిం మైనార్టీలకు అనేక హామీలు ఇచ్చి నేడు వారిపై దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అధికార పార్టీ వర్గీయులు మైనార్టీలపై దాడులు చేస్తుంటే చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం చోద్యం చూడటం విడ్డూరంగా ఉందన్నారు. సైదాపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  


Updated Date - 2021-11-26T06:07:47+05:30 IST