రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
ABN , First Publish Date - 2021-06-20T05:20:25+05:30 IST
కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి
పెదకూరపాడు, జూన్ 19: కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. గుంటూరులోని ఆయన కార్యాలయంలో శనివారం పార్టీనేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే వరుస విపత్తులతో నష్టపోయిన అన్నదాతలకు ధాన్యం బకాయిలు సరైన సమయంలో చెల్లించక పోవటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఈ క్రాపు నమోదు సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పంటల ఉత్పత్తులను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని వివరించారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు బెల్లంకొండ రామ్గోపాలరావు, మద్దిరాల గంగాధర్, మాదినేని వెంకటరావు, ఏసుపాదం, మంచినేని రాజా, బత్తుల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.