‘కేంద్రం నిధులు దోచుకోవడం దారుణం’

ABN , First Publish Date - 2021-11-28T05:29:20+05:30 IST

గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించే 14,15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దోచుకోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శిం చారు.

‘కేంద్రం నిధులు దోచుకోవడం దారుణం’
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి

నల్లజర్ల్ల, నవంబరు 27 :గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించే 14,15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దోచుకోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శిం చారు. నల్లజర్ల మండలం పోతినీడుపాలెంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి సర్పంచ్‌లు తమ సొమ్ముల ను ఖర్చు చేసినప్పటికి ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు జమ చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు తాతిన సత్యనారాయణ, ఏలేటి సత్యనారాయణ, పోతినీడిపాలెం సర్పంచ్‌ పి.గణపతి,యలమర్తి సత్యనారాయణ, చాదరాశికుంట సర్పంచ్‌ నాయుడు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:29:20+05:30 IST