మహానాడులో పోలంరెడ్డి రూ. 5లక్షల విరాళం
ABN , First Publish Date - 2022-05-28T05:04:44+05:30 IST
మహానాడులో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రూ. 5లక్షల విరాళాన్ని చెక్కురూపంలో టీడీపీ జాతీయ అఽధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అందజేశారు.
కోవూరు/బుచ్చిరెడ్డిపాళెం, మే 27 : మహానాడులో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రూ. 5లక్షల విరాళాన్ని చెక్కురూపంలో టీడీపీ జాతీయ అఽధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అందజేశారు. ఆయన వెంట తెలుగుయువత రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోలంరెడ్డి దినేష్రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని అభినందించి పట్టుదలతో పనిచేయాలని సూచించారు. ఈ సారి ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచి రావాలని ఆశీర్వదించారు.