రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారు: మాజీ ఎంపి జితేందర్ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-08T21:02:49+05:30 IST

రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని మాజీఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు.

రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారు: మాజీ ఎంపి జితేందర్ రెడ్డి

మెదక్: రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని మాజీఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన పంటను కొనడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.కానీ కేంద్రం కొనడం లేదంటూ ఆందోళనలు చేస్తూ రైతుల నోట్లో మట్టికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. హుజురాబాద్ తీర్పుతో కేసీఆర్ మైండ్ బ్లాక్ అయ్యిందని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. పీకే సలహాలతో కేసీఆర్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కలు చేసినా తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాలేరని ఆయన అన్నారు. 

Updated Date - 2022-04-08T21:02:49+05:30 IST