ఘనంగా సుబ్బరామరెడ్డి జయంతి

ABN , First Publish Date - 2020-11-27T06:13:34+05:30 IST

ఒంగోలు లోక్‌సభ మాజీ స భ్యుడు మాగుంట సుబ్బరామరెడ్డి జయంతి వేడుకలు గురువారం స్థానిక రామనగర్‌లోని ఎంపీ మాగుంట కార్యాలయంలో ఘనంగా నిర్వ హించారు.

ఘనంగా సుబ్బరామరెడ్డి జయంతి
సుబ్బరామరెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు





ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 26 : ఒంగోలు లోక్‌సభ మాజీ స భ్యుడు మాగుంట సుబ్బరామరెడ్డి జయంతి వేడుకలు గురువారం స్థానిక రామనగర్‌లోని ఎంపీ మాగుంట కార్యాలయంలో ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా సుబ్బరామరెడ్డి చిత్రపటానికి ఆయన మనమడు మాగుంట సుబ్బరామరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలోని సుబ్బరామన్న విగ్రహానికి పూలమాల లు వేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఘనశ్యాం, తాతా ప్రసాద్‌, కుప్పా రంగనాయకులు, గొర్రెపాటి శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, ఇంద్రసేనారెడ్డి, వాయల మోహనరావు, సుబ్బారెడ్డి, ఎంఈ సుం దరరామిరెడ్డి, ఏఈ వినయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-27T06:13:34+05:30 IST