రేపు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2020-11-27T05:03:39+05:30 IST

ట్రిపుల్‌ ఐటీలలో ప్రవేశాలకు ఈ నెల 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జిల్లాలోని 27 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు.

రేపు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 26 : ట్రిపుల్‌ ఐటీలలో ప్రవేశాలకు ఈ నెల 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జిల్లాలోని 27 కేంద్రాల్లో   పరీక్ష నిర్వహిస్తున్నట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 4182 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్‌ షీట్లు, పరీక్షా సామగ్రిని పోలీస్‌ స్టేషన్లలో భద్రపర్చినట్టు తెలిపారు. పరీక్ష  ప్రారంభ సమయానికి రెండు గంటలు ముందుగానే సంబంధిత కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని  స్పష్టం చేశారు. పరీక్షార్ధులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి సొంతంగా శానిటైజర్‌ను తీసుకుని పరీక్షా కేంద్రానికి వెళ్ళా లన్నారు. బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌పాయింట్‌ పెన్నుతో మాత్రమే జవాబులను బబుల్‌ చేయాలన్నారు. 

Updated Date - 2020-11-27T05:03:39+05:30 IST