పంచాయతీలో రికార్డుల పరిశీలన
ABN , First Publish Date - 2021-04-24T04:55:34+05:30 IST
పంచాయతీలో రికార్డుల పరిశీలన
దోమ: మండలంలోని దోర్నాల్పల్లిలో ఎంపీవో సురేష్ శుక్రవారం పర్యటించి పంచాయతీలోని పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో జరిగిన అభివృద్ధిపై డంపింగ్యార్డు తదితర రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు, భౌతికదూరం పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదయ్యసాగర్, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థులు పాల్గొన్నారు.