‘అధికంగా ఎరువుల వాడకం అనర్థదాయకం’
ABN , First Publish Date - 2022-07-07T05:07:54+05:30 IST
వ్యవసాయంలో అధికంగా ఎరువులు వాడడం అనర్థ దాయకమని వ్యవ సాయ శాఖ ఏడీ బీవీ తిరుమలరావు అన్నారు. బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామీణ వ్యవసాయ సహాయకులు, నియోజకవర్గ వ్యవసాయ పాలకమండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు.
టెక్కలి: వ్యవసాయంలో అధికంగా ఎరువులు వాడడం అనర్థ దాయకమని వ్యవ సాయ శాఖ ఏడీ బీవీ తిరుమలరావు అన్నారు. బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామీణ వ్యవసాయ సహాయకులు, నియోజకవర్గ వ్యవసాయ పాలకమండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూరియా వంటి ఎరువులను అధికంగా వినియోగించడం ప్రమాదకరమని వివరించారు. అధిక దిగుబడి వచ్చే తెగుళ్లు సోకని వరి విత్తనాలకు రైతు లు ప్రాధాన్యత ఇస్తున్నారని, యదలు జల్లేటప్పుడు కలుపు నివారణకు ఏ రకమైన మందు లు పిచికారీ చేయాలో క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలని సూచించా రు. ఈ-క్రాప్ న మోదు తప్పనిసని, పీఎం కిసాన్కు సంబంధించి కూడా ఈకేవైసీ పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో సలహా మండలి చైర్మన్ పినకాన వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.