ఉత్సాహంగా పూర్వ క్రీడాకారుల క్రికెట్ మ్యాచ్
ABN , First Publish Date - 2021-03-01T06:05:04+05:30 IST
స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం పూర్వ క్రీడాకారుల క్రికెట్ పోటీలు నిర్వహించారు. 150 మంది క్రీడాకారులు ఐదు జట్టుగా ఏర్పడి క్రికెట్ ఆడారు.
అనకాపల్లి, ఫిబ్రవరి 28: స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం పూర్వ క్రీడాకారుల క్రికెట్ పోటీలు నిర్వహించారు. 150 మంది క్రీడాకారులు ఐదు జట్టుగా ఏర్పడి క్రికెట్ ఆడారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అమర్నాథ్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభిం చారు. త్వరలో అనకాపల్లి జిల్లాగా మారుతుందని, జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తా మన్నారు. అనంతరం సెవెన్ స్టార్స్ టీముకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా దిగి జట్టును విజేతగా నిలిపారు. పరుగులతో నాటౌట్గా నిలిచారు. కార్య క్రమంలో సీనియర్ క్రికెటర్, చోడవరం సీఐ మహ్మద్ ఇలియాస్, డాక్టర్ రామ్మూర్తి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు గుండా సాయి, ఎం.కామేష్, గంటి రవి, ఎస్ఆర్వీ సురేష్, రవిశంకర్ పాల్గొన్నారు.