న్యాయవాదులు విధుల బహిష్కరణ
ABN , First Publish Date - 2022-06-30T06:24:04+05:30 IST
తూర్పు గోదావరి జిల్లాలో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ నర్సీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు.
నర్సీపట్నం అర్బన్, జూన్ 29 : తూర్పు గోదావరి జిల్లాలో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ నర్సీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సంద ర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావాడ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 21న కాకినాడకు చెందిన న్యాయవాది కళా నాగేశ్వరరావుపై కక్షి దారులు దాడి చేయడాన్ని ఖండి స్తున్నట్టు చెప్పారు. న్యాయవాదులకు ప్రభు త్వం తగిన రక్షణ కల్పించాలని కోరారు. కార్యదర్శి లోవరాజు పాల్గొన్నారు.