TS news: మాజీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావుకు బెయిల్ మంజూరు

ABN , First Publish Date - 2022-09-28T18:03:28+05:30 IST

మారేడ్‌పల్లి మాజీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావుకు బెయిల్ మంజూరు అయింది.

TS news: మాజీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావుకు బెయిల్ మంజూరు

హైదరాబాద్: మారేడ్‌పల్లి మాజీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు (Nageshwar rao)కు బెయిల్ మంజూరు అయింది. రూ.లక్ష పూచికత్తుతో నాగేశ్వరరావుకు హైకోర్టు (High court) బెయిల్ మంజూరు చేసింది. కిడ్నాప్, అత్యాచారం కేసులో నాగేశ్వరరావు జైలుకెళ్లిన విషయం తెలిసిందే. గతంలో రెండుసార్లు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా రూ. లక్ష పూచికత్తుతో పాటు, పలు షరతులు విధిస్తూ ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. రెండు నెలల పాటు ప్రతీరోజు ఉదయం 10 గంటలకు విచారన అధికారి ముందు హాజరుకావాలని నాగేశ్వరరావుకు హైకోర్టు షరతు విధించింది. 


కాగా... తన భర్తపై దాడి చేయడంతో పాటు తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారంటూ నాగేశ్వరరావుపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. అత్యాచారం, ఆయుధ చట్టం కింద నాగేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-09-28T18:03:28+05:30 IST