15 టన్నుల పేలుడు పదార్థాల పట్టివేత
ABN , First Publish Date - 2021-10-26T05:12:03+05:30 IST
15 టన్నుల పేలుడు పదార్థాల పట్టివేత
హసన్పర్తి, అక్టోబరు 25 : మండలంలోని జయగిరి వద్ద గల ఆర్ఎన్ఆర్ స్టోన్ క్రషర్లో అక్రమంగా నిల్వ ఉన్న పేలుడు పదార్థాలను సోమవారం హసన్పర్తి పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ శ్రీధర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. జయగిరి వద్ద గల ఆర్ఎన్ఆర్ స్టోన్ క్రషర్లో 15 టన్నుల పేలుడు పదార్థాలు టిప్పర్లో అక్రమంగా నిల్వచేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సాంబయ్య నేతృత్వంలో పోలీసులు స్టోన్ క్రషర్పై దాడి చేసి పేలుడు పదార్థాలను, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల విలువ రూ.8.4 లక్షలు ఉంటుందన్నారు. వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్టోన్ క్రషర్ మేనేజర్ బొల్లెడ జయపాల్రెడ్డి, రుద్రిక ఎక్స్ప్లోజివ్ మేనేజర్ జూకంటి సంపత్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. కాగా, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కొమ్మెర తిరుమల్రెడ్డి, సత్యనారాయణరెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.