కైవ్ నగరంలో బాంబు పేలుళ్లు...నివాసితుల భయాందోళనలు

ABN , First Publish Date - 2022-03-12T15:05:57+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధం శనివారం నాటికి 17వరోజుకు చేరుకుంది....

కైవ్ నగరంలో బాంబు పేలుళ్లు...నివాసితుల భయాందోళనలు

కైవ్(ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధం శనివారం నాటికి 17వరోజుకు చేరుకుంది. రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ దేశంలోని పలు కీలక నగరాలను ముట్టడించింది. రష్యా సైనిక దాడి ప్రారంభించినప్పటి నుంచి 2.5మిలియన్ల మంది ప్రజలు ఉక్రెయిన్ దేశం నుంచి పారిపోయారు.ఉక్రెయిన్‌లోని కైవ్ శివార్లలోని ఇర్పిన్‌లో రష్యా బాంబు దాడి తర్వాత ఒక ఫ్యాక్టరీ,దుకాణం దగ్ధమయ్యాయి. రష్యా సైనికదళాలు ఉక్రెయిన్ రాజధాని నగరమైన కైవ్ కు సమీపంలో ఉన్నాయి. కైవ్ నగరంలో శనివారం రష్యా వేసిన బాంబు పేలుళ్లతో అట్టుడికింది. బాంబుపేలుళ్ల చప్పుళ్లతో కైవ్ నివాసితులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.బుచా, ఇర్పిన్. హోస్టోమెల్‌తో సహా కైవ్ వెలుపల ఉన్న ప్రాంతాల్లో రష్యా బాంబులతో దాడులు చేస్తోంది. 


Updated Date - 2022-03-12T15:05:57+05:30 IST