ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించండి
ABN , First Publish Date - 2020-07-06T10:13:28+05:30 IST
అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకు నేందుకు ప్రభుత్వం గడువు పెంచాలని జిల్లావాసులు కోరుతున్నారు. వాస్తవంగా ..
బొబ్బిలి: అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకు నేందుకు ప్రభుత్వం గడువు పెంచాలని జిల్లావాసులు కోరుతున్నారు. వాస్తవంగా ఈనెల 7లోగా ఎల్ఆర్ఎస్ గడువు ముగుస్తుండగా, పట్టణంలో సుమారు 50 ఎక రాల పరిధిలో 48 అనధికార లేఅవుట్లను టౌన్ప్లానింగ్ అధికారులు గుర్తించారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (ఎల్ఆర్ఎస్)లో ఇంతవరకు 106 మంది వ్యక్తిగత స్థలాల యజమానులు దరఖాస్తు చేసుకుని ఫీజుల రూపంలో రూ.71.41 లక్షలు చెల్లించారు.
ఈ దరఖా స్తులను పరిశీలించి నిర్ణీత రుసుమును వాటి యజ మానుల నుంచి ఇంకా వసూలు చేయాల్సి ఉంది. ఎల్ ఆర్ఎస్ గడువు ముగిసిన తరువాత అనధికార లే అవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుం టుంది. దీనిపై స్థానిక టౌన్ప్లానింగ్ అధికారి బాలరాజు వివరణ కోరగా లాక్డౌన్ కారణంగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు మంద కొడిగా అందాయని తెలిపారు. ఈ గడువును ప్రభుత్వం పొడిగిస్తుందని భావి స్తున్నామని, అలా అయితే దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. తద్వారా మునిసిపాలిటీకి ఆదాయం కూడా సమకూరుతుందని తెలిపారు.