గురుకులాల్లో 5లో చేరడానికి గడువు పెంపు

ABN , First Publish Date - 2022-06-30T20:08:36+05:30 IST

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడ్డ తరగతులు, సాంఘిక, గిరిజన సంక్షేమ, జనరల్‌ గురకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో చేరడానికి జూలై 5 వరకు

గురుకులాల్లో 5లో చేరడానికి గడువు పెంపు

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడ్డ తరగతులు, సాంఘిక, గిరిజన సంక్షేమ, జనరల్‌ గురకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో చేరడానికి జూలై 5 వరకు గడువు పెంచారు. గతంలో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు వారికి కేటాయించిన గురుకులాల్లో చేరడానికి జూన్‌ 29 వరకు గడువు ఇచ్చారు. ఆయా గురుకులాల్లో ఇప్పటికీ కొంత మంది విద్యార్థులు చేరకపోవడంతో గడువుపెంచామని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-06-30T20:08:36+05:30 IST