గురుకులాల్లో 5లో చేరడానికి గడువు పెంపు
ABN , First Publish Date - 2022-06-30T20:08:36+05:30 IST
మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడ్డ తరగతులు, సాంఘిక, గిరిజన సంక్షేమ, జనరల్ గురకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో చేరడానికి జూలై 5 వరకు
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడ్డ తరగతులు, సాంఘిక, గిరిజన సంక్షేమ, జనరల్ గురకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో చేరడానికి జూలై 5 వరకు గడువు పెంచారు. గతంలో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు వారికి కేటాయించిన గురుకులాల్లో చేరడానికి జూన్ 29 వరకు గడువు ఇచ్చారు. ఆయా గురుకులాల్లో ఇప్పటికీ కొంత మంది విద్యార్థులు చేరకపోవడంతో గడువుపెంచామని అధికారులు తెలిపారు.