ఓపెన్ టెన్త్ , ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పెంపు
ABN , First Publish Date - 2021-04-24T04:59:03+05:30 IST
స్వారత్రిక విద్యా పీఠం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజుల గడువు ఏప్రిల్ 30 వరకూ పెంచి నట్లు డీఈవో నాగమణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కలెక్టరేట్, ఏప్రిల్ 23 : స్వారత్రిక విద్యా పీఠం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజుల గడువు ఏప్రిల్ 30 వరకూ పెంచి నట్లు డీఈవో నాగమణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెన్త్ ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్ ఒక్కో సబ్జెక్టుకు రూ.150 ఫీజు నిర్ణయించినట్లు తెలిపారు. ఈనెల 30 తర్వాత సబ్జెక్టు వారీగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. టెన్త్ విద్యార్థులు వచ్చేనెల 4 తేదీ వరకూ సబ్జెక్టుకు రూ.25, 8వ తేదీలోగా రూ.50 అపరాధ రుసుం చెల్లించాలని స్పష్టంచేశారు. రూ.100 అపరాధ రుసుంతో ఇంటర్ విద్యార్థులు ఫీజు చెల్లించాలని వెల్లడించారు.