నెల్లూరులో పోలీసుల విస్తృత తనిఖీలు
ABN , First Publish Date - 2021-11-08T20:47:56+05:30 IST
ఆపరేషన్ పరివర్తన్లో భాగంగా నగరంలో జిల్లా ఎస్పీ విజయరావు
నెల్లూరు: ఆపరేషన్ పరివర్తన్లో భాగంగా నగరంలో జిల్లా ఎస్పీ విజయరావు విస్తృత తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ, ఆత్మకూర్ బస్టాండ్లలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో అణువణువు గాలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల్లో 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. 20 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విజయరావు వెల్లడించారు.
మరో ఘటనలో నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని సూళ్ళూరుపేట పోలీసులు పట్టుకున్నారు. ఆరు కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.