భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. విచారణలో బయటపడిన షాకింగ్ విషయం!
ABN , First Publish Date - 2022-04-20T20:05:56+05:30 IST
తన భర్త కనిపించడం లేదని, అతడిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది..
తన భర్త కనిపించడం లేదని, అతడిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాఫ్తు ప్రారంభించారు.. నాలుగు రోజుల అనంతరం అతడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది.. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.. మృతుడి భార్య వివాహేతర సంబంధం గురించి తెలియడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.. దీంతో అసలు విషయం బయటపడింది.
ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలోని నఖాసా గ్రామానికి చెందిన ప్రేమ్పాల్ అనే వ్యక్తి మూడేళ్ల క్రితం వైశాలి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వైశాలి అప్పటికే తన గ్రామానికి చెందిన విక్రమ్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. వివాహం తర్వాత కూడా విక్రమ్తో ప్రేమాయణం కొనసాగించింది. భర్త ప్రేమ్ను చంపేసి ప్రియుడితో వెళ్లిపోవాలని వైశాలి నిర్ణయించుకుంది. వారం రోజుల క్రితం భర్త ఆహారంలో విషం కలిపింది. అది తిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రేమ్ను వైశాలి, విక్రమ్ కలిసి ఉరేసి చంపేశారు.
అనంతరం మృతదేహాన్ని గ్రామ శివార్లలోని పొదల్లో పడేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు వైశాలీ పోలీస్ స్టేషన్కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు నాలుగు రోజుల అనంతరం ప్రేమ్ మృతదేహం దొరికింది. ఎవరో హత్య చేశారని తేలింది. గ్రామస్థులను విచారించగా వైశాలి వివాహేతర సంబంధం బయటపడింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమె నేరం అంగీకరించింది. వైశాలిని, విక్రమ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.