ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-01-09T01:20:36+05:30 IST
జిల్లాలోని ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత
కర్నూలు: జిల్లాలోని ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పద్మావతి స్కూల్ వెనకాల మసీదు నిర్మాణ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీశైలం నియోజకవర్గ బీజేపి ఇంచార్జీ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో అద్దాలు ధ్వంసం అయ్యాయి. బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ను మైనార్టీలు ముట్టడించారు. అవాంఛనీయి సంఘటనలు జరుగకుండ రెండు వర్గాల వారిని పోలీసులు చెదరగొడుతున్నారు.