530 మందికి కంటి వైద్య పరీక్షలు

ABN , First Publish Date - 2022-08-14T05:57:09+05:30 IST

టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నర సింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్‌లు చే యించుకున్న వారికి శనివారం కంటి అద్దాలను పంపిణీ చేశారు.

530 మందికి కంటి వైద్య పరీక్షలు
కంటి అద్దాలతు తీసుకున్న వృద్ధులు

కనిగిరి, ఆగస్టు 13 : టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నర సింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్‌లు చే యించుకున్న వారికి శనివారం కంటి అద్దాలను పంపిణీ చేశారు. పామూరురోడ్డులోని అమరావతి గ్రౌండ్స్‌లో శనివారం 530 మందికి కంటి వైద్య  పరీ క్షలు నిర్వహించి కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ ఏడాది జూన్‌లో మెగా ఉచిత కంటి వైద్య శిబి రంలో 638 మందికి డాక్టర్‌ ఉగ్ర ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. శంకర కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ సాయిస్నేహ, డాక్టర్‌ స్మృతి అగర్వాల్‌, డాక్టర్‌ సాయి మోనీష కంటి ఆపరేషన్‌చేయించుకున్న వారిలో 560 మందికి  మరోసారి పరీక్షలు నిర్వహిం చారు. అనంతరం ఉచితంగా అద్దాలను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో శంకర కంటి ఆసుపత్రి సిబ్బంది నాగబాబు, శ్రీను, పారా మెడికల్‌ సిబ్బంది, టీడీపీ నాయకులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, షేక్‌ జంషీర్‌అహ్మద్‌, భేరిపుల్లారెడ్డి, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, రామాంజనేయరెడ్డి , రజాక్‌, రాజా, భాస్కర్‌రెడ్డి, జనార్దన్‌, చిలపాటి బ్రహ్మం, ఇలియాజ్‌, ఫరూక్‌, అప్రోజ్‌, మణికంఠ, రమిహాన్‌ కరణం అరుణ, సుభాషిణి, వాజిదా, పార్వతి, తులసి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:57:09+05:30 IST