విశాఖ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి మాటలివీ..
ABN , First Publish Date - 2020-07-14T13:01:44+05:30 IST
విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో జరిగిన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షితో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మాట్లాడింది.
విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో జరిగిన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షితో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మాట్లాడింది. ఈ సందర్భంగా అసలు ఏం జరిగింది..? అనే విషయాన్ని నిశితంగా ఆయన చెప్పుకొచ్చారు. ‘నేను ఇదే కంపెనీలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నిన్న మధ్యాహ్నం నుంచి అన్లోడింగ్ మొదలుపెట్టారు. అయితే ఇంకా మిగిలిపోయే సరికి ఉదయం చేద్దాం అని చెప్పి పని ఆపేసి అందరం తిని పడుకున్నాం. 10:30, 11 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దాలు వచ్చాయి. ఏం జరిగిందా అని బయటికి వచ్చి చూస్తే పెద్ద ఎత్తున మంటలు, శబ్దాలు వస్తున్నాయ్. గేట్కు తాళం వేసి ఉండటంతో బయటికి రావడానికి వీలు కాలేదు. గేట్ పై నుంచి దూకి బయటికొచ్చేశాను. వెంటనే వేరొకరితో ఫోన్ తీసుకుని మా ఓనర్కు సమాచారం ఇచ్చాను. అయితే ఎంత మంది గాయపడ్డారు.. ఎంత మంది విధుల్లో ఉన్నారు అనేది తెలియట్లేదు’ అని డ్రైవర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో చెప్పారు.