కోవిడ్ కేసుల పెరుగుదల, 6 జిల్లాల్లో ఫేస్ మాస్క్లు తప్పనిసరి
ABN , First Publish Date - 2022-04-18T20:55:48+05:30 IST
కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 6 జిల్లాల్లో ఫేస్ మాస్క్లు..
లక్నో: కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 6 జిల్లాల్లో ఫేస్ మాస్క్లు తప్పనిసరి చేస్తూ సోమవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని ఆదేశాలిచ్చింది. గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, హపూర్, మీరట్, బులంద్షహర్, లక్నోల్లో ఆ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.
మాస్క్లు ధరించకుంటే ఫెనాల్టీలు వేయడాన్ని ఆపేయాలని ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఇటీవల నిర్ణయించాయి. ఏప్రిల్ 1 నుంచి మాస్క్లు తప్పనిసరి కాదంటూ యూపీ ప్రభుత్వం ప్రకటించింది కూడా. కేంద్రం సైతం ఫేస్మాస్క్లు ధరించడం, సామాజిక దూరం పాటించడం మినహా అన్ని కోవిడ్ ఆంక్షలను ఉపసంహరించుకుంటున్నట్టు మార్చి 23న ప్రకటించింది. కాగా, గత 24 గంటల్లో యూపీలోని గౌతమ్ బుద్ధ్ నగర్లో కొత్తగా 65 కోవిడ్ కేసులు నమోదు కాగా, ఘజియాబాద్లో 20, లక్నోలో 10 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలోని 75 జిల్లాల్లో పరిస్థితిని నిశితంగా గమనించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.