అతడికి 24 ఏళ్లు.. ఆమెకు 22 ఏళ్లు.. ఫేస్‌బుక్‌లో పరిచయం.. పిలిచింది కదా అని ఇంటికి వెళ్లాడా కుర్రాడు.. ఆమె కోరిక విని..

ABN , First Publish Date - 2021-10-17T07:57:36+05:30 IST

అమ్మాయి పిలిచింది కదా.. ముందూ వెనకా ఆలోచించకుండా వెళితే ఆ తర్వాత చాలా బాధపడాలి. అందులోనూ ఆన్‌లైన్ పరిచయాలంటే ..

అతడికి 24 ఏళ్లు.. ఆమెకు 22 ఏళ్లు.. ఫేస్‌బుక్‌లో పరిచయం.. పిలిచింది కదా అని ఇంటికి వెళ్లాడా కుర్రాడు.. ఆమె కోరిక విని..

అమ్మాయి పిలిచింది కదా.. ముందూ వెనకా ఆలోచించకుండా వెళితే ఆ తర్వాత చాలా బాధపడాలి. అందులోనూ ఆన్‌లైన్ పరిచయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాలి. అలా ఆలోచించకుండా వెళితే ఇదిగో ఇలాగే జరుగుతుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే 24 ఏళ్ల యువకుడికి 10రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఆమె తన పేరు పూజ అని, తన వయసు 22 ఏళ్లు అని చెప్పింది. నెమ్మదిగా మాటలు కలిపి.. అక్టోబర్ 11వ తేదీన ఇంటికి రమ్మని పిలిచింది. అమ్మాయి పిలిచేసరికి నిశాత్‌పుర్‌లోని ఆమె ఇంటికి వెళ్లాడు రాజ్‌కుమార్. అక్కడికి వెళ్లగానే ఆమె విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దుస్తులు తీసేయాలని, శృంగారం చేద్దామని ప్రేరేపించింది. అయితే రాజ్‌కుమార్ దానికి ఒప్పుకోలేదు. దీంతో పూజ స్వయంగా అతడి బట్టలు విప్పడం ప్రారంభించింది. అతడు అడ్డుకోవడం ఇద్దరి మధ్య కొంత పెనుగులాట జరిగింది. ఇంతలో అప్పటివరకు అదే గదిలో కర్టెన్ చాటున దాక్కుని ఉన్న పూజ బాయ్‌ఫ్రెండ్ మనీశ్ బయటకొచ్చాడు.


అక్కడ జరిగిన తంతంతా తాను వీడియో తీశానని రాజ్‌కుమార్‌ను బెదిరించసాగాడు. ఇదంతా చూసిన రాజ్‌కుమార్ బెదిరిపోయి అక్కడి నుంచి పారిపోయి భాన్‌పూర్ చేరుకున్నాడు. అయితే అతడి వెనకే అక్కడికి చేరుకున్న మనీశ్.. రాజ్‌కుమార్‌ను బెదిరించాడు. పూజను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఈ వీడియోను వైరల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. తాను పెళ్లి చేసుకోలేనని రాజ్‌కుమార్ చెప్పడంతో అయితే రూ.20 లక్షలు ఇస్తే వీడియోను డిలీట్ చేస్తానని చెప్పాడు. అందుకు తనకు కొంతసమయం కావాలని రాజ్‌కుమార్ కోరడంతో.. మనీశ్ 4 రోజుల సమయం ఇచ్చాడు.


4 రోజులకు కూడా డబ్బు సర్దుబాటు కాకపోవడంతో రాజ్‌కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. జరిగినదంతా చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ సమయంలోనే మనీశ్‌తో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకోవడానికి ఓ ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారం.. గురువారం ఓ రూ.లక్ష ఇస్తానని మనీశ్‌కు చెప్పిన రాజ్‌కుమార్ బైర్ సింహ్ ప్రాంతానికి రావాలని పిలిచాడు. అక్కడకు రాగానే పోలీసులు మనీష్‌ను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత నిందితురాలు పూజ అలియాజ్ దివ్యను కూడా అరెస్టు చేశారు.

Updated Date - 2021-10-17T07:57:36+05:30 IST