పర్యాటకులకు వసతులు కరువు
ABN , First Publish Date - 2021-11-28T03:55:36+05:30 IST
ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువుగా పేరుగాంచిన కంభం చెరువు కట్ట ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు కనీస వసతులు కరువయ్యాయి.
కంభం చెరువుకట్టపై లేని సౌకర్యాలు
శిథిలావస్థలో అతిథిగృహం
ఫర్నిచర్, కిటికీలు దొంగలపాలు
మందుబాబులకు అడా ్డ
కంభం, నవంబరు 27 : ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువుగా పేరుగాంచిన కంభం చెరువు కట్ట ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు కనీస వసతులు కరువయ్యాయి. 250 సంవత్సరాల క్రి తం చెరువుకట్టపై బ్రిటీష్ అధికారులు నిర్మించిన అ తిథి గృహంలోని విలువైన ఫర్నిచర్, కిటీకీలు, వాకిళ్ల ను దొంగలు ఎత్తుకెళ్లారు. అతిథి గృహం పూర్తిగా శిథిలమైంది. 5 సంవత్సరా ల క్రితం ఇరిగేషన్ అధి కారులు 7 లక్షల వ్యయం తో మరమ్మతులు చేయిం చి తలుపులు, కిటికీలు బి గించారు. కాపలాదారు డు లేకపోవడంతో దొంగ లు కిటికీలు, తలుపుల ను మళ్లీ దొంగిలించారు. దీంతో భవనం నిరుపయోగంగా మారింది. మందుబాబులకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. చెరువులో నీరు ఉన్నా, లేకున్నా సెలవుల్లో పర్యాటకులు వస్తుంటారు. తినుబండారాలు తెచ్చుకుని చెరువుకట్టపై చెట్లకింద కూర్చుని భోజనాలు చే స్తుంటారు. వర్షం వస్తే తలదాచుకునేందుకు కూడా లే ని పరిస్థితి ఏర్పడింది. కంభం చెరువు కట్టపై తేరాతే జీ పండుగను నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో అధి క సంఖ్యలో వచ్చే వారు వసతులు లేక తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు చెరువు కట్టపై కాపలాదారుడిని నియమించా లని స్థానికులు కోరుతున్నారు.