ఐ లవ్యూ నాన్నా.. ఈ అవమానాన్ని తట్టుకోలేను అంటూ ఆ కొడుకు చేసిన పని ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-21T22:51:47+05:30 IST

ఆ తండ్రీకొడుకులిద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తున్నారు.. ఇటీవల ఆ కంపెనీ యజమాని తండ్రిని మందలించాడు..

ఐ లవ్యూ నాన్నా.. ఈ అవమానాన్ని తట్టుకోలేను అంటూ ఆ కొడుకు చేసిన పని ఏంటంటే..

ఆ తండ్రీకొడుకులిద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తున్నారు.. ఇటీవల ఆ కంపెనీ యజమాని తండ్రిని మందలించాడు.. సిబ్బంది అందరి ముందు అవమానించాడు.. ఆ అవమానాన్ని కొడుకు భరించలేకపోయాడు.. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. చనిపోయే ముందు ఓ వీడియో రూపొందించాడు.. కంపెనీ యజమానిని శిక్షించాలని కోరాడు. 


హర్యానాలోని యమునా నగర్‌కు చెందిన భాను అనే వ్యక్తి తన కొడుకు మోహిత్‌తో కలిసి చేతన్ మెటల్స్ అనే ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం భానును కంపెనీ యజమాని అందరి ముందూ అసభ్యకరంగా తిట్టాడు. ఆ అవమానాన్ని భాను కొడుకు మోహిత్ తట్టుకోలేకపోయాడు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ వీడియోను రూపొందించాడు. కంపెనీ యజమానిని శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. 


`నాన్నా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నా. అందుకే ప్రాణం వదిలేస్తున్నా. నిన్ను అవమానించిన వ్యక్తికి శిక్ష పడాల`ని మోహిత్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.  

Updated Date - 2022-04-21T22:51:47+05:30 IST