విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మూడు బంకుల దగ్ధం
ABN , First Publish Date - 2021-07-27T03:15:56+05:30 IST
కావలి పట్టణం ఉదయగిరి బ్రిడ్జి కింద సోమవారం తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మూడు బంకులు దగ్ధమై సుమారు రూ.1.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
రూ.1.5 లక్షల ఆస్తి నష్టం
కావలి రూరల్, జూలై 26: కావలి పట్టణం ఉదయగిరి బ్రిడ్జి కింద సోమవారం తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మూడు బంకులు దగ్ధమై సుమారు రూ.1.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. స్థానికుల కథనం మేరకు... ఉదయగిరి బ్రిడ్జి కింద మెకానిక్ షాపు పెట్టుకుని జీవనం గడుపుతున్న షేక్ రహంతుల్లాకు చెందిన 2 బంకుల్లో షార్ట్ సర్క్యుట్తో మంటలు వ్యాపించి పక్కనే ఉన్న అల్లాబక్షుకు చెందిన సీటుకవర్ల దుకాణానికి మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బాధితులైన రహంతుల్లాకు రూ.1 లక్ష, అల్లాబక్షుకు రూ.50,000 నష్టం వాటిల్లినట్లు తెలిపారు. బంకులు పెట్టుకుని రెక్కల కష్టం మీద కరోన కష్టకాలంలో జీవనం వెళ్లబుచ్చుతున్న సమయంలో అగ్రిప్రమాదం రూపంలో తీవ్రనష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.