విద్యుత్ తీగలు తెగిపడి పొలాల్లో మంటలు
ABN , First Publish Date - 2022-06-26T04:05:21+05:30 IST
ముత్తుకూరు శివారు ప్రాంతం మద్దిమాను సమీపంలో శనివారం విద్యుత్ తీగలు తెగిపడడంతో పొలాల్లో మంటలు చెలరేగాయి.
ముత్తుకూరు, జూన్ 25: ముత్తుకూరు శివారు ప్రాంతం మద్దిమాను సమీపంలో శనివారం విద్యుత్ తీగలు తెగిపడడంతో పొలాల్లో మంటలు చెలరేగాయి. తీగల్లో విద్యుత్ సరఫరా ఉండడంతో వరి కోతలు పూర్తయిన పొలాల్లో గడ్డి తగలబడింది. అక్కడ నుంచి సుమారు అర కిలోమీటరు దూరం పాటూరువారికండ్రిగ రహదారిపై గ్యాస్ గోడౌన్ సమీపం వరకు పొలాల్లో మంటలు వ్యాప్తి చెందాయి. ముత్తుకూరు ప్రధాన రహదారిపై పొగలు కమ్ముకున్నాయి. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సరఫరా నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సకాలంలో మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.