పక్షవాతం చికిత్స కోసం మాంత్రికుడి వద్దకు భర్తతో వెళ్లిన మహిళ.. చికిత్సలో భాగంగా భర్తను ఊరి చివరకు పంపిన మాంత్రికుడు.. ఆ తరువాత ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-13T10:48:27+05:30 IST

పక్షవాతంతో బాధపడుతున్న ఓ మహిళ డాక్టర్ల వద్ద నయంకాకపోవడంతో ఒక చేతబడి మాంత్రికుడి వద్దకు చికిత్స కోసం వెళ్లింది. ఆ మహిళతో పాటు ఆమె భర్త కూడా ఆమె వెంట వెళ్లాడు. కానీ ఆ మాంత్రికుడు చికిత్స పేరుతో ఆ మహిళను ఒంటరిగా చేసి ఆమెపై...

పక్షవాతం చికిత్స కోసం మాంత్రికుడి వద్దకు భర్తతో వెళ్లిన మహిళ.. చికిత్సలో భాగంగా భర్తను ఊరి చివరకు పంపిన మాంత్రికుడు.. ఆ తరువాత ఏం చేశాడంటే..

పక్షవాతంతో బాధపడుతున్న ఓ మహిళ డాక్టర్ల వద్ద నయంకాకపోవడంతో ఒక చేతబడి మాంత్రికుడి వద్దకు చికిత్స కోసం వెళ్లింది. ఆ మహిళతో పాటు ఆమె భర్త కూడా ఆమె వెంట వెళ్లాడు. కానీ ఆ మాంత్రికుడు చికిత్స పేరుతో ఆ మహిళను ఒంటరిగా చేసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌లోని ఇందోర్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆజాద్ నగర్‌లో నివసించే షకీలా(పేరు మార్చబడినది) అనే మహిళకు కొద్ది కాలం క్రితం పక్షవాతం సోకింది. ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో జీవనం సాగించేందుకు చాలా కష్టపడేది. షకీలా చికిత్స కోసం ఆమె భర్త ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం కనపడలేదు. ఆమె బంధువులొకరు ఆమెపై ఎవరో చేతబడి చేసారని.. దానిని సరి చేయకపోతే డాక్టర్ల మందులు పనిచేయవని చెప్పారు. ఆ మాటలు నమ్మిన షకీలా సమీపంలో ఆషిక్ బాబా అనే మాంత్రికుడి వద్దకు చికిత్స కోసం వెళ్లింది. 


చేతబడి గురించి ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఆషిక్ బాబా బాగా పేరు ఉంది. పక్షవాతం చికిత్స కోసం భర్తతో పాటు వచ్చిన షకీలా చూసిన ఆ బాబా ఆమెను కామ దృష్టితో చూశాడు. ఆ తరువాత ఏదో కొన్ని మంత్రం చేసిన దారాలను ఒక సంచిలో కట్టి ఊరి చివర 10 కిలోమీటర్ల దూరంలో ఒక నదిలో పారవేయమని షకీలా భర్తకు ఆషిక్ బాబా చెప్పాడు. బాబా చెప్పినట్టు షకీలా భర్త ఆ సంచి తీసుకొని వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న షకీలాపై ఆషిక్ బాబా అత్యాచారం చేశాడు. 


అత్యాచారం చేసిన తరువాత ఈ విషయం బయటికి చెబితే ఆమె కుటుంబాన్ని తన మంత్ర శక్తితో నాశనం చేస్తానని షకీలాను బాబా బెదిరించాడు. ముందే ఆరోగ్యం బాగోలేక సతమతమవుతున్న తనపై ఆ కామాంధుడు చేసిన అఘాయిత్యానికి షకీలా కుంగిపోయింది. భర్తతో ఇంటికి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె భర్త అడ్డుపడడంతో జరిగిన అన్యాయం గురించి చెప్పింది. దీంతో షకీలా భర్త పోలీసులకు ఆషిక్ బాబాపై ఫిర్యాదు చేశాడు. 


పోలీసులు తనకోసం వెతుకుతున్నారని తెలిసిన ఆ దొంగబాబా పరారయ్యాడు. పోలీసులు ఆషిక్ బాబాపై చీటింగ్, అత్యాచారం కేసు నమోదు చేసి అతనికోసం గాలిస్తున్నారు.


Updated Date - 2022-01-13T10:48:27+05:30 IST