రాజమండ్రి టూటౌన్ పోలీసులకు చిక్కిన నకిలీ డీఎస్పీ
ABN , First Publish Date - 2022-03-17T00:19:25+05:30 IST
జిల్లాలోని రాజమండ్రి టూటౌన్ పోలీసులకు ఓ నకిలీ డీఎస్పీ
తూర్పు గోదావరి: జిల్లాలోని రాజమండ్రి టూటౌన్ పోలీసులకు ఓ నకిలీ డీఎస్పీ చిక్కాడు. నిందితుడి నుంచి రూ.10.9లక్షలు, మూడు జతల నకిలీ యూనిఫామ్స్, ఫేక్ లెటర్హెడ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మందికి టోకరా వేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నిందితుడిపై పోలీసులు నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని నల్గొండ జిల్లా మట్టపల్లి వాసి బత్తుల శ్రీనుగా పోలీసులు గుర్తించారు.