గుంటూరులో నకిలీ విత్తనాల కలకలం
ABN , First Publish Date - 2021-11-21T20:01:20+05:30 IST
గుంటూరు: జిల్లాలో నకిలీ విత్తనాలు కలకలం రేపుతోంది.
గుంటూరు: జిల్లాలో నకిలీ విత్తనాలు కలకలం రేపుతోంది. ఒకవైపు ప్రకృతి ప్రకోపం.. మరోవైపు దళారుల మోసంతో రైతులు నిండా మునుగుతున్నారు. విత్తనాలు కొనే దగ్గర నుంచి పంటలు కొనేవరకు దగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు గుంటూరు జిల్లాలో నకిలీ మిర్చి విత్తనాలతో రైతులను మోసం చేశారు. అలా ఒకసారి కాదు.. వరుసగా రెండేళ్లపాటు నకిలీ విత్తనాలను రైతులకు ఇచ్చి ముంచారు. నకిలీ విత్తనాలపై ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు.