కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి
ABN , First Publish Date - 2021-05-09T07:37:58+05:30 IST
మాలకొండ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కొవిడ్పై అవగాహన కల్పించి, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి తెలిపారు.
మాలకొండకు వచ్చే భక్తులకు ఎమ్మెల్యే మహీధర్రెడ్డి సూచన
మాలకొండ (వలేటివారిపాలెం), మే 8: మాలకొండ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కొవిడ్పై అవగాహన కల్పించి, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి తెలిపారు. మండలంలోని మాలకొండ లక్ష్మీనరసింహస్వామిని శనివారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సెకండ్వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. దర్శనానికి వచ్చే భక్తులందరూ నిబంధనలు పాటించాలన్నారు. అన్నదానం ప్రసాదంలో భక్తుల మద్య ఆరు అడుగులు దూరం ఉండేలా కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ పరిసర ప్రాగణమంతా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గర్బగుడిలో భక్తులు భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కేబీ.శ్రీనివాసరావు ఎస్ఐ చావా హజరత్తయ్య, వైసీపీ నాయకులు పరిటాల వీరాస్వామి, కోడూరి వసంతరావు, వరికూటి సంజీవ్రెడ్డి, డేగా వెంకటేశ్వర్లు, అనుమోల వెంకటస్వామి, ఇరపని అంజయ్య, బచ్చు శ్రీనివాసులు, ఇరపని నారాయణ తదితరులు పాల్గొన్నారు.