మాపై తప్పుడు కేసులు బనాయించారు: ఎంపీ విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2022-04-07T02:14:45+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర

మాపై తప్పుడు కేసులు బనాయించారు: ఎంపీ విజయసాయిరెడ్డి

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీపై  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చిదంబరం, ఆజాద్‌ కలిసి తనపై, సీఎం జగన్‌పై తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. టెర్రరిస్ట్‌ దాడులన్నీ కాంగ్రెస్‌ హయాంలో జరిగినవేనన్నారు. సభను చిదంబరం తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. చిదంబరం చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి తప్పుడు పనులని ఆయన ఘాటుగా విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చాక టెర్రరిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని ఆయన పేర్కొన్నారు. పొరుగు దేశంపై సర్జికల్‌ దాడులు చేశారని ఆయన అన్నారు. 

Updated Date - 2022-04-07T02:14:45+05:30 IST