కాల భైరవుడిని దర్శించుకున్న చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు

ABN , First Publish Date - 2021-03-06T05:04:41+05:30 IST

కాల భైరవుడిని దర్శించుకున్న చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు

కాల భైరవుడిని దర్శించుకున్న చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు
కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజ నిర్వహిస్తున్న బ్రాహ్మణి, వసుంధర

రామారెడ్డి, మార్చి 5: జిల్లాలోని ఇస్సన్నపల్లి-రామారెడ్డి గ్రామాల మధ్య వెలసిన కాల భైరవస్వామి ఆలయంలో శుక్రవారం ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు బ్రాహ్మణి, సినీహీరో నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర, ఆయన కుమారుడు మోక్షజ్ఞ కాలభైరవ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయం చుట్టూ ఎనిమిది ప్రదక్షణలు చేశారు. ఆలయ సిబ్బంది వారికి స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు. నందమూరి, నారా వారి కుటుంబ సభ్యులను చూడటానికి గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఇదే సమ యంలో కాలభైరవ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆలయంలో వారికి ఎదురు పడటంతో వారిని పలకరించారు. తాను గతంలో టీడీపీలో పని చేసిన జ్ఞాపకాలను, బాలకృష్ణతో పరిచయం వంటి వాటిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:04:41+05:30 IST