బంధువుల ఊరికి వెళ్లి తిరిగొచ్చిన కుటుంబ సభ్యులు.. ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉండటంతో డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-06-20T21:50:26+05:30 IST

ఆ కుటుంబ సభ్యులు అందరూ బంధువుల ఇంటికి వెళ్లారు. వెళ్లిన పని పూర్తైన వెంటనే తిరిగి ఇంటికి పయనమయ్యారు. వాళ్లు ఇంటికి చేరుకునే సరికి అర్ధరాత్రైపోయింది. అయితే.. ఆ కుటుంబ సభ్యులు వచ్చే సరికే.. ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉండటం

బంధువుల ఊరికి వెళ్లి తిరిగొచ్చిన కుటుంబ సభ్యులు.. ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉండటంతో డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ కుటుంబ సభ్యులు అందరూ బంధువుల ఇంటికి వెళ్లారు. వెళ్లిన పని పూర్తైన వెంటనే తిరిగి ఇంటికి పయనమయ్యారు. వాళ్లు ఇంటికి చేరుకునే సరికి అర్ధరాత్రైపోయింది. అయితే.. ఆ కుటుంబ సభ్యులు వచ్చే సరికే.. ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉండటంతో  షాకయ్యారు. తలుపు కూడా తెరిచి ఉండటంతో భయపడుతూ ఇంట్లోకి వెళ్లారు. అనంతరం ఇంట్లో కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కాగా.. ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



హర్యానాకు చెందిన విజయ్ మహరాజ్ కుటుంబ సభ్యులతో కలిసి అంబాలా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడి బంధువులు ఢిల్లీలో నివాసం ఉంటుండగా.. విజయ్ బంధువుల్లో ఒకరు కొద్దిరోజుల క్రితం మరణించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు.. విజయ్ తన కుటుంబ సభ్యులతో సహా ఢిల్లీకి బయల్దేరాడు. అక్కడ మృతుడి కుటుంబ సభ్యులును ఓదార్చి.. తర్వాత ఇంటికి పయనమయ్యాడు. విజయ్, అతడి కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకునే సరికి అర్ధరాత్రి దాటింది. అయితే ఇంటికి చేరుకునే సరికే ఇంట్లో లైట్లు వెలగడం చూసి విజయ్ షాకయ్యాడు. డోర్లు కూడా తెరిచి ఉండటంతో భయపడుతూ ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటం, అల్మారాని డబ్బు నగలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2022-06-20T21:50:26+05:30 IST