సినీ గేయ రచయిత భువనచంద్రకు ‘వేటూరి’ పురస్కారం
ABN , First Publish Date - 2021-01-22T08:03:35+05:30 IST
‘వేటూరి’ కవితా పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్రకు ప్రదానం చేయనున్నట్టు వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్
పాయకరావుపేట (విశాఖపట్నం జిల్లా), జనవరి 21: ‘వేటూరి’ కవితా పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్రకు ప్రదానం చేయనున్నట్టు వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రకటించాయి. ఈ నెల 29న తూర్పుగోదావరి జిల్లా తుని చిట్టూరి మెట్రోలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు అసోసియేషన్ వ్యవస్థాపకులు సీహెచ్ విజయ్ప్రకాష్, పీఠం వ్యవస్థాపక కార్యదర్శి కలగ రామజోగేశ్వరశర్మ తెలిపారు. వేటూరి సాహితీ పీఠానికి శాశ్వత గౌరవాధ్యక్షునిగా సినీ నటుడు తనికెళ్ల భరణి, వ్యవస్థాపక అధ్యక్షునిగా వ్యాపారవేత్త చక్కా సూర్యనారాయణ, అధ్యక్షులుగా శ్రీప్రకాష్ విద్యా సంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహరావు వ్యవహరిస్తున్నారు.