కోహ్లీ, గిల్ డకౌట్.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్పై సీరియస్!
ABN , First Publish Date - 2021-03-06T04:51:57+05:30 IST
టీమిండియా పరుగుల యంత్రం, కెప్టెన్ కోహ్లీ డకౌట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఇంగ్లండ్తో మొతేరా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. కోహ్లీతో పాటు భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా డకౌట్ అయ్యాడు.
అహ్మదాబాద్: టీమిండియా పరుగుల యంత్రం, కెప్టెన్ కోహ్లీ డకౌట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఇంగ్లండ్తో మొతేరా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. కోహ్లీతో పాటు భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా డకౌట్ అయ్యాడు. దీన్ని జీర్ణించుకోలేక పోయిన కొందరు నెటిజన్లు వారిద్దరినీ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. వారిపై మీమ్స్ చేస్తూ నెట్టింట ఈ ఆటగాళ్లను టార్గెట్ చేయడం ప్రారంభించారు.
ఊహించని వైపు నుంచి వీరికి సమాధానం వచ్చింది. ఇలా కోహ్లీ, గిల్లను ట్రోల్ చేస్తున్న నెటిజన్లలను రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ విమర్శించాడు. కోహ్లీ, గిల్కు అండగా నిలబడిన అతను.. ‘‘మీమ్స్ చేయడం అటుంచితే అసలు వాళ్ల గురించి ఒక్క మాటైనా మాట్లాడటానికి మనం ఎవరం? వాళ్లు ఇండియాలో బెస్ట్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్లను ఇలా ట్రోల్ చేసి మీరే నవ్వులపాలు అవుతారు. అలా చేయకండి. కొంచెం మర్యాదగా ప్రవర్తించండి’’ అంటూ నీతులు చెప్పాడు.