రావాడలో పొలం బడి
ABN , First Publish Date - 2021-03-02T05:14:57+05:30 IST
రావాడలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు.
పరవాడ, మార్చి 1: రావాడలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు జి.సుధాకర్, ప్రేమ శేఖర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పొలం బడి సదస్సు ముఖ్య ఉద్దేశం గురించి రైతులకు వివరించారు. వరి పొలంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోహన్రావు, అసిస్టెంట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, మండల వ్యవసాయాధికారిణి సీహెచ్ చంద్రావతి, సర్పంచ్ మోటూరి సన్యాసినాయుడు, మండల వ్యవసాయ సలహా కమిటీ కన్వీనర్ కోన రామారావు, కావలి వాసు, పలువురు రైతులు పాల్గొన్నారు.