నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-11-30T04:56:04+05:30 IST
పింఛా ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రాజెక్టు మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి
సుండుపల్లె, నవంబరు 29: పింఛా ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రాజెక్టు మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె కిసాన్ మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి, బీజే పీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్షనాయుడులతో కలిసి పింఛా ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతోనే డ్యాం తెగిందన్నారు. రాజంపేటలోని అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు దించడానికి వీలులేక నీరు మొత్తం వెళ్లిపోయిందని, అధికారుల నిర్లక్ష్యం వల్లే పింఛా ప్రాజెక్టు కట్ట తెగి నీరు ఏటిపాలు అ యిందన్నారు. బీజేపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, పోతుగుంట రమే్షనాయుడు, రామజగదీష్, వెంకట్రామరాజు, సుబ్బరాజు, రాచరాయుడు, వెంకట్రమణనాయుడు పాల్గొన్నారు.