ఉపాధ్యాయుడిగా రైతు బిడ్డ
ABN , First Publish Date - 2022-06-27T05:05:43+05:30 IST
మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన కృష్ణమూర్తి వయస్సు 53 ఏళ్లు. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
1998 డీఎస్సీలో 53 ఏళ్లకు ఉద్యోగం
మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన కృష్ణమూర్తి వయస్సు 53 ఏళ్లు. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. 1998 డీఎస్సీలో భాగంగా ఈ వయసులో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఆయన 2008 దాకా డీఎస్సీ రాస్తూనే వచ్చారు. 1998 డీఎస్పీలో ఉద్యోగం వచ్చి ఈ రైతు ఇప్పుడు ఉపాధ్యాయుడయ్యాడు. అయితే తనను కష్టకాలంలో ఆదుకొన్న వ్యవసాయాన్ని వీడనని, ఉపాధ్యాయ వృత్తి చేస్తూనే వ్యవసాయం కొనసాగిస్తానని ఆయన అన్నారు.
-మహానంది