అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-23T05:15:59+05:30 IST
అప్పుల బాధలు భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
రామారెడ్డి, ఏప్రిల్ 22: అప్పుల బాధలు భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రామారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై అంబీర్ భవ నేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డికి చెందిన తుప్పతి కొమురయ్య(50) గోర్ల కాపరిగా పనిచేస్తున్నాడు. కొంత వ్యవసాయ భూమిని అప్పు చేసి కొనుగో లు చేశాడు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. తీవ్ర మన స్థాపం చెంది ఇంటివద్ద గల గోర్రెల కొట్టంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సాయవ్వ ఫిర్యాదు మేర కు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.