అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-01T06:42:11+05:30 IST

అప్పుల బాధతో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపూర్‌ గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

రాజాపేట, జూన 30: అప్పుల బాధతో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపూర్‌ గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుజ్జుక బాలరాజు (51)  తనకున్న ఎకరంన్నర పొలంతో పాటు, తన సోదరుడు గణేష్‌ నుంచి మరో ఎకరంన్నర పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎకరంలో వరి నాటు వేయగా, మిగతా రెండు ఎకరాల్లో పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నాడు. దీనికి తోడు గత ఆరు నెలల క్రితం అప్పులు చేసి తమ కుమార్తె వివాహం చేశాడు. వ్యవసాయ పెట్టుబడి, కుమార్తె వివాహానికి అయిన పెళ్లికి ఖర్చు మొత్తం కలిపి  రూ.7లక్షలు అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  


Updated Date - 2022-07-01T06:42:11+05:30 IST