ట్రాక్టర్‌ ఢీ కొని రైతు మృతి

ABN , First Publish Date - 2021-07-24T07:11:43+05:30 IST

మండలంలోని చిల్లర్గి గ్రామంలో గురువారం రాత్రి రాం దాస్‌(40) పొలంలో ట్రాక్టర్‌ ఢీకొని మృతి చెందాడని ఎస్సై రంజిత్‌ తెలిపారు.

ట్రాక్టర్‌ ఢీ కొని రైతు మృతి


పిట్లం, జూలై 23 : మండలంలోని చిల్లర్గి గ్రామంలో గురువారం రాత్రి రాం దాస్‌(40) పొలంలో ట్రాక్టర్‌ ఢీకొని మృతి చెందాడని ఎస్సై రంజిత్‌ తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ చిల్లర్గి గ్రామంలో రాందాస్‌ తన సొంత పొలంలో అద్దె టాక్టర్‌తో కేజ్‌వీల్స్‌తో దమ్ము చేయిస్తుండగా డ్రెవర్‌ సాయిలు నిర్లక్ష్యంతో ట్రాక్టర్‌ రాందాస్‌కు ఢీకొందన్నారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు  తెలిసారు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రంజిత్‌ తెలిపారు.

Updated Date - 2021-07-24T07:11:43+05:30 IST