కాషాయకండువా కప్పుకోనున్న మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి?

ABN , First Publish Date - 2022-06-29T19:45:11+05:30 IST

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్‌ను వీడిన నాటి నుంచి ఆయన కాంగ్రెస్‌లో చేరతారని ఒక ప్రచారం..

కాషాయకండువా కప్పుకోనున్న మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి?

హైదరాబాద్ : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి(konda Visweswar Reddy) టీఆర్ఎస్‌(TRS)ను వీడిన నాటి నుంచి ఆయన కాంగ్రెస్‌(Congress)లో చేరతారని ఒక ప్రచారం.. బీజేపీ(BJP)లో చేరతారనే మరో ప్రచారం బీభత్సంగా జరిగింది. అయితే ఇటీవలి కాలంలో ఆయన కాస్త సైలెంట్‌గానే ఉండటంతో ఈ ప్రచారాలు కూడా సైలెంట్ అయిపోయాయి. తాజాగా ఆయన బీజేపీలోకి వెళతారనేది హాట్ టాపిక్. బీజేపీ అగ్ర నేతల సమక్షంలో విశ్వేశ్వరరెడ్డి కాషాయకండువా కప్పుకుంటారనే ప్రచారం తిరిగి ఊపందుకుంది. దీనికి కారణం లేకపోలేదు. తరుణ్‌చుగ్, బండి సంజయ్‌తో ఆయన 45నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమనే టాక్ నడుస్తోంది. రాష్ట్ర నాయకులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మాట్లాడించారు. మంచి రోజు చూసుకొని రేపు లేదా ఎల్లుండి నడ్డా సమక్షంలో కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరనున్నారని సమాచారం. 

Updated Date - 2022-06-29T19:45:11+05:30 IST