రైతు వేదికలు సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-03-07T05:37:49+05:30 IST
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదికలు రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా భాసిల్లుతాయని, వీటిని రైతులు సద్విని యోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈ శ్వర్ అన్నారు. శనివారం మండలంలోని చెందోళి గ్రామంలో రైతు వేదిక ను, వైకుంఠధామాలను కలెక్టర్ గుగులోతు రవితో కలిసి మంత్రి ప్రారం భించారు.
-రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లి, మార్చి 6 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదికలు రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా భాసిల్లుతాయని, వీటిని రైతులు సద్విని యోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈ శ్వర్ అన్నారు. శనివారం మండలంలోని చెందోళి గ్రామంలో రైతు వేదిక ను, వైకుంఠధామాలను కలెక్టర్ గుగులోతు రవితో కలిసి మంత్రి ప్రారం భించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రభు త్వం రైతు సంక్షేమానికి, వారి అభివృద్ధికి అధిక ప్రాధాన్యతానిస్తుందని, అందులో భాగంగా పలు వినూత్న పథకాలను ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అ మలు చేస్తోందన్నారు. ఒకప్పుడు వ్యవసాయం అంటే దండగా అనే దశ నుంచి నేడు రాష్ట్రంలోని ప్రతి పల్లెలో పండగల సందడి చేస్తుందని, ఇ దంతా సీఎం కేసీఆర్ ఘనతేనని పేర్కోన్నారు. తెలంగాణ రైతాంగాన్ని దే శానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ధృఢసంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుం దని, రైతువేదికలు వంటి వినూత్న పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేవ న్నారు. రైతుల పంపపొలాలకు సాగు నీరందించేందుకు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుతో పాటు చెక్డ్యామ్ల నిర్మాణాలు, రైతువేదికలు, 24 గంటల ని రంతర విద్యుత్ సరఫరా, నీటి తీరువా పన్నును రద్దు చేయడం, రైతు భీమా, రైతుబంధు వంటి సంక్షేమ, అభివృద్ది పథకాలను అందిస్తుందన్నా రు. రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని పి లుపునిచ్చారు. రైతులు రైతువేదికల ద్వారా ఆధునాతన వ్యవసాయ విధా నాలను, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగును అవలంబిస్తూ గి ట్టుబాటు ధరను పొందాలన్నారు. అనంతరం గ్రామంలో వీధివీధిలో పా దయాత్ర నిర్వహించి పలు సీసీరోడ్లు, కుల సంఘం భవనం నిర్మాణం ప నులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గుగులోతు రవి, ఎం పీపీ శంకరయ్య, వైస్ ఎంపీపీ సత్తయ్య, జడ్పీటీసీ జలేంధర్, సింగిల్విండో చైర్మన్లు డా. రాజసమన్రావు, వెంకట మాధవరావు, సర్పంచ్ అలిశెట్టి ర వీంధర్, తహసీల్దార్ నీవన్, ఆర్ఐ రాజేంధర్ రావు, ఏవో కరుణ, పార్టీ శ్రే ణులు, వివిధ గ్రామాల స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికా రులు, ప్రజలు పాల్గొన్నారు.