రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-03T06:45:13+05:30 IST

మండలంలోని గెణిగెర గ్రామం వద్ద శనివారం సాయంత్రం గొడిశెలపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి (42) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

రైతు ఆత్మహత్య

కణేకల్లు, జూలై 2: మండలంలోని గెణిగెర గ్రామం వద్ద శనివారం సాయంత్రం గొడిశెలపల్లి గ్రామానికి చెందిన  ఈశ్వరరెడ్డి (42) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తనకున్న ఐదు ఎకరాల పొలంలో ఈశ్వర రెడ్డి దానిమ్మ సాగు చేశాడు. ఇందుకోసం దాదాపు రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. పంట దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు తీర్చే మార్గం కానరాక పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు  అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. రైతు భార్య లీలావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దిలీప్‌ కుమార్‌ తెలిపారు. రైతుకు ఒక కూతురు ఉంది.

Updated Date - 2022-07-03T06:45:13+05:30 IST