AP News: జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే రైతు ఆత్మహత్యలు
ABN , First Publish Date - 2022-09-02T22:25:54+05:30 IST
Amaravathi: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంద
Amaravathi: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) సీఎం జగన్ (CM Jagan)పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రోజురోజుకు అన్నదాతల పరిస్థితి దుర్భరంగా తయారై ..ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలే వారి ఆత్మహత్యలకు కారణమన్నారు. సకాలంలో రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించట్లేదన్నారు. వైసీపీ పాలనలో ఏరంగం బాగుందో సీఎం జగనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.