తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి: రేవంత్
ABN , First Publish Date - 2022-05-02T20:53:42+05:30 IST
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంటను కొనే దిక్కులేక రైతు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతులకు అండగా నిలవడానికి కాంగ్రెస్ నేత రాహుల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని తెలిపారు. ఓయూలో రాహుల్సభకు అనుమతి కోసం వినతిపత్రం ఇస్తే.. ప్రభుత్వ ఒత్తిడితో తిరస్కరించారని విమర్శించారు. మే 7న ఎన్ఎస్యూఐ నేతలను రాహుల్ పరామర్శిస్తారని రేవంత్ తెలిపారు.
అంతకుముందు చంచల్గూడ జైలులో న్ఎస్యూఐ నాయకులకు రేవంత్రెడ్డి, జగ్గారెడ్డి, అనిల్, అంజన్కుమార్యాదవ్ పరామర్శించారు. రాహుల్ సభకు అనుమతి ఇవ్వలేదని, ఆదివారం ఓయూలో ఆందోళనకు దిగిన ఎన్ఎస్యూఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.