రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-05-21T03:37:56+05:30 IST

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శుక్రవారం నాగారంలో రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ లైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ కనెక్షన్‌ లేని 23 మంది రైతుల కోసం ఐటీడీఏ నిధులతో మోటారు కనెక్షన్లకు విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సింగిల్‌ ఫేజ్‌తో ఇబ్బం దులు పడ్డ రైతుల సమస్య త్రీఫేజ్‌తో తీరుతుందన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
విద్యుత్‌ స్తంభాలకు శంకుస్ధాపన చేస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

హాజీపూర్‌, మే 20: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శుక్రవారం నాగారంలో రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ లైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ కనెక్షన్‌ లేని 23 మంది రైతుల కోసం ఐటీడీఏ నిధులతో మోటారు కనెక్షన్లకు విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సింగిల్‌ ఫేజ్‌తో ఇబ్బం దులు పడ్డ రైతుల సమస్య త్రీఫేజ్‌తో  తీరుతుందన్నారు. సిమెంట్‌ విద్యుత్‌ స్తంభాలు, 7 ట్రాన్స్‌ఫార్మర్‌లు మంజూరయ్యాయని తెలిపారు. ఎస్‌ఈ మేక రమే ష్‌బాబు, డీఈ రాజన్న, ఏడీఏ నూక రాజశేఖర్‌, ఏఈ శ్రావణ్‌కుమార్‌, టెక్నికల్‌ ఏఈ రమేష్‌, ఐటీడీఏ ఏడీ భారతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ విజిత్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-21T03:37:56+05:30 IST