వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-04T03:26:29+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ పలు సంఘాల నాయకులు అన్నారు.
జడ్చర్ల, డిసెంబరు 3 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ పలు సంఘాల నాయకులు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా గురువారం సీఐటీయూ, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఐఏడబ్ల్యూయూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలోని నేతాజీచౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పరశురాం, ఉపాధ్యక్షుడు జగన్, సీపీఎం నాయకులు తెలుగు సత్తయ్య మాట్లాడారు. ప్రజాసంఘాల నాయకులు కృష్ణయాదవ్, సాయిలు, రామస్వామి, శంకర్, గద్దశ్రీను, వశియాబేగం, శ్రీదేవి, సమంత పాల్గొన్నారు.